హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సెక్రటరీతో రాజేశ్వర్ రావు మాటామంతి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సెక్రటరీతో రాజేశ్వర్ రావు మాటామంతి

  • వడ్డేపల్లి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చిన త్రిలోక్ కపూర్
  • తెలంగాణ రాజకీయాలపై చర్చించిన ఇరువురు

కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ జనరల్ సెక్రటరీ త్రిలోక్ కపూర్ హైదరాబాద్ లో విచ్చేసిన సందర్భంగా ఆయణ్ని ఇంటికి ఆహ్వానించారు. వడ్డేపల్లి ఆహ్వానం మేరకు త్రిలోక్ కపూర్ బుధవారం ఉదయం రాజేశ్వర్ రావు నివాసానికి వచ్చారు. త్రిలోక్ కపూర్ కు రాజేశ్వర్ రావు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం తెలంగాణ రాజకీయాలకు గురించి చర్చించారు. రాష్ట్రంలో, కూకట్ పల్లి నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అనుకూల అంశాలపై ఇరువురూ చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top