శ్రీ వీర హనుమాన్ వ్యాయామ శాల షెడ్డును ప్రారంభించిన వడ్డేపల్లి

  • తన తండ్రి వడ్డేపల్లి నర్సింగ్ రావు జ్ఞాపకార్థం రూ. 1.30 లక్షలతో షెడ్డు నిర్మాణం
    కూకట్ పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వీర హనుమాన్ వ్యాయామ శాల యూత్ అసోసియేషన్ కోసం బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు తన తండ్రిగారైన కీర్తిశేషులు వడ్డేపల్లి నర్సింగ్ రావు గారి జ్ఞాపకార్థంగా రూ. 1,30,000లతో షెడ్డు నిర్మాణం చేయించారు. గురువారం ఈ వ్యాయామ శాల షెడ్డు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. అదేవిధంగా పలువురికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రూ. 5,00,000 ల విలువైన సుకన్య సమృద్ధి యాక్సిడెంటల్ పాలసీ చేయించారు. ఈ పాలసీ పాస్ బుక్కులు మరియు డాక్యుమెంట్లను ఈరోజు రాజేశ్వర్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ వ్యాయామ శాల అధ్యక్షులు అశోక్, వెంకటరాజ్యం, శివ, సమంత, డివిజన్ అధ్యక్షులు జిఆర్ రమేష్, కంటెస్టెడ్ కార్పొరేటర్ నర్సిరెడ్డి, జిల్లా కార్యదర్శి సురేందర్ రెడ్డి, పద్మారావు, మహిళా మోర్చా నాయకురాలు శివరంజని, వాణి, మంజుల, రజిత, సంగీత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top