శ్రీ దాసాంజనేయ స్వామి వార్షికోత్సవాల్లో పాల్గొన్న వడ్డేపల్లి

“హనుమాన్ ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి”

  • శ్రీ దాసాంజనేయ స్వామి వార్షికోత్సవాల్లో పాల్గొన్న వడ్డేపల్లి
  • అంజనీపుత్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజేశ్వర్ రావు
    కూకట్ పల్లిలోని శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారి అనుబంధ దేవాలయం శ్రీదాసాంజనేయ ఆలయ 17 వార్షికోత్సవం, హనుమాన్ జయంతి ప్రవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. మే 11 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో ఆదివారం బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధైర్యానికి, విశ్వాసానికి ప్రతీక అయిన హనుమాన్ ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని ప్రార్థించారు. ఆలయ ఉత్సవాలను ఘనం నిర్వహించిన ఆలయ కమిటీని రాజేశ్వర్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top