వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లి భవానీ నగర్ లో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద స్వామి ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాల్లో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ రాజేశ్వర్ రావుకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన అనంతరం దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top