మిత్రుడు, బిజెపి నాయకులు జి. సతీష్ కుమార్ గారు, ఘన విజయం సాధించిన సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు.

ఫతేనగర్ డివిజన్ పరిధిలోని సమతా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో మిత్రుడు, బిజెపి నాయకులు జి. సతీష్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీగా నరసింహ గారు, ఘన విజయం సాధించిన సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, వారి నివాసానికి వెళ్లి సతీష్ కుమార్ గారిని అభినందిస్తూ💐💐💐 శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు, ఏలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా స్వచ్ఛందంగా గెలిచినటువంటి ఎన్నిక అని తెలియజేస్తూ, సతీష్ కుమార్ పై కాలనీవాసులు పెట్టుకున్న నమ్మకాన్ని వారు కాపాడుతారని అదేవిధంగా కాలనీ అభివృద్ధిలో మా వంతు సహాయం కూడా ఉంటుందని వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు భరోసా ఇచ్చారు.సమత నగర్ లో ఉన్నటువంటి స్థానిక నాయకుల ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ విజయోత్సవాలకు విచ్చేసినటువంటి నాయకులతో కార్యకర్తలతో ఆత్మీయంగా పలకరింఛారు, ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్షణపల్లి సూర్యరావు కూకట్ పల్లి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర రావు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top