మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో భాగంగా మూసాపేట అంజయ్య నగర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల నేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ,కూకట్ పల్లి బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే సేవలు చాలా గొప్పవి, వారు ఎంతో గొప్ప సంఘసంస్కర్త మహిళల యొక్క విద్యకు మరియు బడుగు బలహీన వర్గాల విద్య కోసం ఏనలేని పోరాటం చేసినటువంటి మహానాయకుడు జ్యోతిబాపూలే అని తెలియజేశారు. కుల నిర్మూలన, అంటరానితనాన్ని నిర్మూలించే అనేక కార్యక్రమాలు ఎన్నో చేశారు, అంతేకాకుండా వితంతు మహిళల కోసం, ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారిని కాపాడారు, అలాంటి మహనీయుని ఆశలను వారి స్ఫూర్తితో కొనసాగిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్షణపల్లి సూర్యారావు, మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్,బిజెపి సీనియర్ నాయకులు యంజాల పద్మయ, జి.వినోద్, ముసాపెట్ డివిజన్ అధ్యక్షుడు పిట్ల మనోహర్, కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు,దుర్గేశ్వర,దినేష్, బిజెపి బిజెపి నాయకులు – కార్యకర్తలు స్థానిక బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top