మరోసారి మోడీ సర్కార్, తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం అంటు, కూకట్ పల్లిలో ఇంటింటికి ప్రచారం చేస్తున్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్ పల్లి 121 డివిజన్ పరిధిలోని కూకట్ పల్లి రామాలయం రోడ్, శాంతినగర్ కాలనీ ,కూకట్ పల్లి విలేజ్ శక్తి కేంద్రం లోని బూత్ నంబర్ 7,8 &13 లోని వీధుల్లో, స్థానిక శక్తి కేంద్ర ఇన్చార్జ్ చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారి పరివేక్షణలో నిర్వహించిన దివార్ లిఖన్ అభియాన్ (గోడరత అభియాన్) కార్యక్రమంలో భాగంగా, ఈరోజు బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొని, మరోసారి మోడీ సర్కార్ – తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం అనే నినాదంతో కమలం పువ్వు గుర్తుతో పలుచోట్ల గోడరాతలు స్వయంగా తాను రాసి స్థానిక కార్యకర్తలతో కలిసి రాయించి వినూత్న ప్రచారం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలంటే దేశంలో మరోసారి మోడీ గారికి అవకాశం ఇయ్యాలంటూ, భారతదేశం సుభిక్షంగా సురక్షకంగా, సుఖంగా ఉండాలంటే నిస్వార్థపరుడైన ప్రపంచ మేధావి శ్రీ నరేంద్ర మోడీ గారు ఉంటేనే సాధ్యమవుతుందని, అదే విధంగా తెలంగాణలో బండి సంజయ్ గారి సారధ్యంలో, బిజెపి ప్రభుత్వాని గెలిపించి డబల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలని స్థానిక ప్రజలతో పాటు కార్యకర్తలను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్శనపల్లి సూర్యరావు,రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు నాయినేని సూర్య ప్రకాష్ రావు,డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు,జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు వినయ్,డివిజన్ నాయకులు కృష్ణప్రియ,శంకర్ రెడ్డి,మన్నె భాస్కర్,వెంకట్ రెడ్డి,బాల కుమార్, ఈశ్వర్,దుర్గా ప్రసాద్ రావు,ప్రశాంత్ రావు,రామకృష్ణ,శ్రీనివాస్, విశాల్ సాగర్, సంతోష్ గుప్తా, సాయిబాబా గుప్తా,యువమోర్చా నాయకులు భాస్కర్, దారసాయి, శ్రీధర్, నారాయణ, అభినయ్, టింకు, నవీన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top