బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లిలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకోవడం జరిగింది.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూనే, భారత్ ను అభివృద్ధి పథంలో నడింపించాలనే సంకల్పంతో స్థాపించబడిన భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి బీజేపీ కార్యకర్తకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ 43 ఏళ్లలోనే అత్యధిక మంది సభ్యులతో ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించడానికి కృషి చేసిన పార్టీ సీనియర్ నాయకులు, సామన్య కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లిలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ సూర్యారావు గారిని సన్మానించాం. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, మహేష్, శంకర్ రెడ్డి, బాలరాజు, ఏ సాయి, భాస్కర్, విక్కీ, సంతోష్, సాయి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం
#BJPSthapnaDiwas #BJPFoundationDay #VaddepallyRajeshwarrao
#bjpkukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top