బీజేపీ అల్లాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రాంగోపాల్ సింగ్ ని కలిసిన వడ్డేపల్లి

భారతీయ జనతా పార్టీ అల్లాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రాంగోపాల్ సింగ్, ఆయన కుమారుడు బీజేవైఎం నాయకుడు సందీప్ నాయక్ లను బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి చర్చించారు. రాంగోపాల్ సింగ్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వడ్డేపల్లి కోరారు. పార్టీలో క్రియాశీలకంగా మారాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరక డాకయ్య, బీజేపీ సీనియర్ నాయకులు జలంధర్, గంగాధర్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్, సాయిచంద్, అంకిత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
#vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpkukatpally #kukatpallyconstituency #bjpparty #bjp4telangana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top