నూతన వధూవరులకు ( అజయ్ రెడ్డి వివాహం గౌతమితో ) శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి

నూతన వధూవరులను ఆశీర్వదించిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు
కూకట్ పల్లికి చెందిన ఎనుముళ్ల ప్రకాశ్ రెడ్డి ఉమాదేవి దంపతుల ఏకైక కుమారుడు అజయ్ రెడ్డి వివాహం గౌతమితో గురువారం ప్రగతి నగర్ లోని కేజీఆర్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వరుడి కుటుంబం నుంచి అందిన ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఈ వివాహమహోత్సవానికి హాజరయ్యారు. వివాహానంతరం నూతన వధూవరులు అజయ్ గౌతమిలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి వైవాహిక బంధం కలకాలం సుఖసంతోషాలతో కొనసాగాలని దీవించారు. ఈ వేడుకలో రాజేశ్వర్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని వధూవరులకు వివామహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top