ఘనంగా హోటల్ రాయల్ సిగ్నేచర్ ప్రారంభోత్సవం

  • లాంఛనంగా ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి
  • విలావంతమైన సౌకర్యాలపై యజమానులకు అభినందనలు తెలియజేసిన రాజేశ్వర్ రావు
  • హైదరాబాద్ మాదాపూర్ లోని సిద్ది వినాయక నగర్ లో హోటల్ రాయల్ సిగ్నేచర్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. హోటల్ యజమానులు కళ్యాణ్ చక్రవర్తి, మిథున్ కుమార్ ల విజ్ఞప్తి మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఈ రాయల్ సిగ్నేచర్ హోటల్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హోటల్ అంతా కలియతిరిగి, సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయల్ సిగ్నేచర్ హోటల్ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ లో అన్ని రకాల హంగులతో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడం పట్ల అభినందించారు. ఈ హోటల్ వ్యాపారం అత్యంత లాభాసాటిగా సాగుతూ యజమానులకు కాసుల వర్షం కురిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆర్షణపల్లి సూర్యారావు, విజయ్, గోపాల్, కౌశిక్, జిగ్నేష్, మోహన్, వెంకట్, హేమంత్, సాయి, అఖిల్ రావు, చింటూ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top