గడప గడపకు బీజేపీ కార్యక్రమానికి విశేష స్పందన: వడ్డేపల్లి

  • వివేకానంద నగర్ చేరిన రవి కుమార్ పాదయాత్ర
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీశ్ రెడ్డితో కలిసి పాల్గొన్న రాజేశ్వర్ రావు
  • పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన కాలనీ వాసులు
  • ప్రజా సమస్యలను సాదరంగా విన్న నేతలు
  • బీజేపీ ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని హమీ

కూకట్ పల్లి/ శేర్లింగంపల్లి: నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నేత రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా గడపగడపకు బీజేపీ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర బుధవారం ఈ పాదయాత్ర వివేకానంద నగర్ కాలనీకి చేరింది. కాలనీలో దాదాపు మూడు నుంచి నాలుగు రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది. బుధవారం గడప గడప కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి గారితో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో రవి కుమార్ యాదవ్ తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ రవి కుమార్ చేపట్టిన గడప గడపకు బీజేపీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని తెలిపారు. వివేకానంద నగర్ కాలనీ వాసులు ఈ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న అనేక సమస్యలను వివరిస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మంచి నీటి కొరత, పెన్షన్లు, నిరుద్యోగం తదితర అనేక సమస్యలను గడప గడప కార్యక్రమంలో ప్రజలు రవి కుమార్ దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను సాదరంగా విని అతి త్వరలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనీ, ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top