కోమరవెల్లి మల్లన్నాకి జై

ఈరోజు కూకట్పల్లి,సప్తగిరి కాలనీలోని చిత్తరమ్మ గుడి దగ్గర వెలసిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబిక, గొల్ల కేతమ్మ దేవాలయ 18 వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేష్ రావు గారిని ఆహ్వానించిన కూకట్పల్లి గొల్ల కురుమ సంఘం సభ్యులు.

అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా గొల్ల కురుమ సంఘం సభ్యులు రాజేశ్వరరావు గారికి శాలువాగప్పి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి గొల్ల కురుమ సంఘం సభ్యులు గండి మల్లేష్ యాదవ్,వినోద్ యాదవ్,మనోజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top